- by Ganesh Adla
రోహిణి కార్తె అంటే ఏంటి?
-
- by Ganesh Adla
- in Devotional
- 0 likes
భారతీయ పంచాంగంలో సూర్యుడు కొన్ని నక్షత్రాల పరిధిలో ప్రయాణిస్తుంటాడు. అందులో “రోహిణి” అనే నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే కాలాన్ని “రోహిణి కార్తె” అంటారు. ఈ సమయంలో, ఎండలు చాలా తీవ్రమవుతాయి. నేల వేడెక్కిపోతుంది. గాలే మంటలా అనిపిస్తుంది. చెట్లు, జంతువులు, మనుషులు అందరూ అలసిపోతారు. అందుకే పెద్దలు “రోహిణి కార్తె పడింది… జాగ్రత్తగా ఉండాలి” అని చెబుతారు. “అగ్ని కార్తులు” అంటే? “అగ్ని” అంటే మంట. “కార్తులు” అంటే కాల భాగాలు లేదా దశలు.
సమ్మర్లో అత్యంత వేడిగా ఉండే కొన్ని రోజులను కలిపి “అగ్ని కార్తులు” అంటారు. ఈ రోజుల్లో, సూర్య కిరణాలు నేరుగా ఎక్కువ ప్రభావం చూపుతాయి. భూమి ఎక్కువ వేడి నిల్వ చేసుకుంటుంది. మధ్యాహ్నం బయట తిరగడం ప్రమాదకరం అవుతుంది. అందుకే పాత కాలంలో రైతులు, పెద్దలు, మధ్యాహ్నం బయటకు వెళ్లేవారు కాదు. చల్లని పదార్థాలు తాగేవారు. నీడలో విశ్రాంతి తీసుకునేవారు. దీనికి ఏమైనా స్టోరీ ఉందా?ఉంది.
ఇది పూర్తిగా పౌరాణిక కథ కాకపోయినా, మన పెద్దలు చెప్పుకునే ఒక అందమైన భావం ఉంది.
🌞 సూర్యుడు – రోహిణి కథ
పురాణాల ప్రకారం చంద్రుడికి 27 మంది భార్యలు ఉంటారు. ఆ 27 మంది అంటే 27 నక్షత్రాలు. అందులో రోహిణి చంద్రుడికి చాలా ఇష్టమైన భార్య. చంద్రుడు ఎక్కువగా రోహిణి దగ్గరే ఉండేవాడట. దాంతో మిగతా నక్షత్రాలు కోపపడ్డాయట. అప్పుడు ప్రకృతి సమతుల్యం కాస్త మారి, సూర్యుని వేడి ప్రభావం భూమిపై ఎక్కువైందని ఒక పురాణ భావన. అందుకే “రోహిణి కాలంలో ఎండలు మండిపోతాయి” అని పెద్దలు చెప్పుకుంటారు. 🌾
శాస్త్రీయంగా చూస్తే? ఈ సమయంలో, సూర్యుడు భూమికి సంబంధించిన కోణంలో ఎక్కువ వేడి ఇస్తాడు. గాలిలో తేమ తగ్గుతుంది. వేడి గాలులు (Heat Waves) ఎక్కువవుతాయి. అందుకే మే చివరి – జూన్ మొదట్లో మనకు భరించలేని ఎండలు అనిపిస్తాయి.
పెద్దలు చెప్పే కొన్ని మాటలు 🌿
“రోహిణి ఎండకి రాళ్లు కూడా పగులుతాయి”
“అగ్ని కార్తుల్లో నీళ్లు బంగారం”
అందుకే ఈ కాలంలో, ఎక్కువ నీళ్లు తాగాలి 💧
మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. మధ్యాహ్నం బయట తిరగకూడదు. తెల్లటి, పలుచని బట్టలు వేసుకోవాలి. ప్రకృతిని గమనించి కాలాన్ని అర్థం చేసుకున్న మన పెద్దల జ్ఞానం నిజంగా అద్భుతం కదా!
✍🏻 జెట్టి హిమబిందు ✍🏻
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply