- by Sandeep
చలో సంసద్ యాత్రకు అనుమతి లేదు: ఢిల్లీ పోలీసులు
చలో సంసద్ యాత్రకు అనుమతి లేదు: ఢిల్లీ పోలీసులు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సోమవారం తలపెట్టిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఆ పార్టీ ప్రతిపాదించిన ‘చలో సంసద్’ యాత్రకు అనుమతి కోరలేదు.. తాము ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు. న్యూఢిల్లీ జిల్లాలో BNSS సెక్షన్ 163 (పాత CRPC సెక్షన్ 144) అమల్లో ఉందని వివరించారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుంపుగా ఉండకూడదని, ర్యాలీలు, నిరసనలు, ఊరేగింపులు నిషేధమని స్పష్టం చేశారు. జంతర్ మంతర్లో ముందస్తు అనుమతితో నిరసనలు చేసుకోవచ్చని తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply